Connect with us

Police News

BBMA Police : News రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి – మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Published

on

రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి – మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

BBMA Police : News

రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి – మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత మరియు మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 16న శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో “రహదారి భద్రత నియమాలు పాటించండి – మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి (డ్రగ్స్ వద్దు బ్రో)” అనే సందేశంతో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను అదనపు ఎస్పీ కెవి రమణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బాధ్యతాయుతమైన జీవనం గడపాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించడం, అధిక వేగాన్ని నివారించడం అవసరమన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనం నడపడం వల్ల ప్రాణాపాయ ప్రమాదాలు సంభవిస్తున్నాయని హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసి మరింత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వి.రామారావు, డీటీఆర్‌బీ విభాగం ఎస్సై సురేష్, సామాజిక కార్యకర్త వంగపండు రవికుమార్ పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

Published

on

By

BBMA POLICE E:NEWS // పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

🟥 BBMA POLICE E:NEWS //

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

శ్రీకాకుళం జిల్లా మందస పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి గౌరవ పోక్సో కోర్టు జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మందస పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 169/2019 U/s 354-D, 506, 509 ఐపీసీ & సెక్షన్ 11 r/w 12 పోక్సో చట్టం–2012 కింద నమోదు చేసిన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువైనట్లు కోర్టు తేల్చింది.

వివరాల్లోకి వెళ్తే, తేది 30-12-2019న మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో నిందితుడు కొర్రాయి తిరుపతి @ రెడ్డి, బాధితురాలిని గత రెండు సంవత్సరాలుగా అసభ్యంగా మాట్లాడటం, వెకిలి చేష్టలతో మానసికంగా వేధించడం, ఒక సందర్భంలో స్కూల్ నుండి వస్తుండగా ఆమె చేయి పట్టుకొని అసభ్యకరంగా మాట్లాడడం చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తే విడిచిపెట్టనని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు అప్పటి మందస ఎస్‌.ఐ సి హెచ్ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున జి.వి.ఎస్.యు. విశాలాక్షి వాదనలు వినిపించారు.

గౌరవ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్. సునీత గారు, తేది 16-02-2026న నిందితుడికి ఒక సంవత్సరం సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా, అలాగే సెక్షన్ 506 ఐపీసీ కింద 6 నెలల జైలు శిక్ష విధించారు.

పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Continue Reading

Police News

BBMA Police : News చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్టు, బంగారు పుస్తెల తాడు స్వాధీనం

Published

on

By

BBMA Police : News చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్టు, బంగారు పుస్తెల తాడు స్వాధీనం

BBMA Police : News

చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్టు, బంగారు పుస్తెల తాడు స్వాధీన

శ్రీకాకుళం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు సమర్థవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి అపహరించిన బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. గురువారం టౌన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

ఈ కేసులో మెట్టక్కవలస గ్రామానికి చెందిన మెండ వెంకటరమణ (A1), గుంట ప్రమీల (A2), గుంట జగదీశ్వరరావు (A3) నిందితులుగా గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు.

తేదీ 30-01-2026న వేకువజామున AP 40 EP 9770 నంబర్ గల కారులో నందగిరిపేట గ్రామానికి చేరుకున్న నిందితులు, బాధితురాలు ముసలమ్మ ఇంటి వద్ద మాయమాటలు చెప్పి లోపలికి ప్రవేశించి బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని పరారయ్యారు.

ఈ రోజు (05-02-2026) నిందితులు బంగారాన్ని శ్రీకాకుళంలో అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి బంగారు పుస్తెల తాడు, కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదనలో రూరల్ పోలీసుల పాత్ర అభినందనీయమని డీఎస్పీ పేర్కొన్నారు.

Continue Reading

Police News

చక్రతీర్థ స్నానాల సందర్భంగా ప్రైవేట్ డ్రోన్ల వినియోగంపై నిషేధం

Published

on

By

చక్రతీర్థ స్నానాల సందర్భంగా ప్రైవేట్ డ్రోన్ల వినియోగంపై నిషేధం

.BBMA Police : News

చక్రతీర్థ స్నానాల సందర్భంగా ప్రైవేట్ డ్రోన్ల వినియోగంపై నిషేధం

శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ భక్తుల భద్రత దృష్ట్యా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 18వ తేదీన శ్రీ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం లో నిర్వహించనున్న చక్రతీర్థ స్నానాల సందర్భంగా ప్రైవేట్ డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆలయం పరిసర ప్రాంతాలు, స్వామివారి స్నానాలు జరిగే వంశధార నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ప్రైవేట్ డ్రోన్లను ఎగర వేయరాదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే చక్రతీర్థ స్నానాలు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

భక్తుల భద్రత, ప్రజా శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా చర్యలు కఠినతరం చేసినట్లు తెలిపారు.

ఈ ఆదేశాలను ఉల్లంఘించి డ్రోన్లు ఎగర వేయడం, అనుమతి లేకుండా ఫోటోలు లేదా వీడియోలు చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

భక్తులు, ప్రజలు పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించి, ఉత్సవాలు ప్రశాంతంగా మరియు సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని శ్రీకాకుళం జిల్లా పోలీసులు కోరారు.

Continue Reading

Trending